G.V.REDDY

CELL: +91 9908480326

Friday, July 29, 2016

మళ్లీ ఎంసెట్ తప్పదు.. కేసీఆర్ కన్ఫర్మ్

కొందరి తప్పు అందరి పాలిట శాపంగా మారిన ఉదంతం ఇది. తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్వహించిన ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష పత్రాలు లీక్ కావటం.. భారీ కుంభకోణం చోటు చేసుకున్న ఈ ఉదంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంతమంది చేసిన తప్పునకు అందరిని బాధ్యుల్ని చేసేలా కేసీఆర్ నిర్ణయం ఉండటం గమనార్హం. ఎంసెట్ 2 లీకు వ్యవహారంలో 100 నుంచి 150 మధ్యన తప్పు చేసి ఉండొచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది.

ఈ ఉదంతాన్ని విచారించిన సీఐడీ సైతం.. లీకులో మ్యాగ్జిమం 150 మందికి మించి భాగస్వామ్యం ఉందని తేల్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 56 వేల మంది విద్యార్థులు.. వారి కుటుంబాలకు మనోవ్యధను కలిగించేలా పరీక్ష రద్దు నిర్ణయాన్ని తీసుకోవద్దంటూ విద్యార్థులు తల్లిదండ్రులు.. విద్యార్థులు.. పలువురు అధ్యాపకులు విన్నవించారు.

తాజా ఉదంతంపై సుదీర్ఘంగా సమీక్ష జరిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంసెట్ 2 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయంతో వేలాది మంది మరోసారి ప్రవేశ పరీక్షను రాయాల్సి ఉంటుంది. దీంతో.. మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
Share:

0 comments:

Post a Comment

google ads

2222222

01

Blog Archive

Definition List

5/Cars/feat-tab

Unordered List

4/Cars/post-per-tag

Support

5/slider-recent